టాలీవుడ్ లో విషాదం.

టాలీవుడ్ లో విషాదం.

Published on Aug 7, 2020 9:19 AM IST

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ రచయిత మరియు నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మీ నేడు తుదిశ్వాస విడిచారు. నేడు ఉదయం పురుచూరి వెంకటేశ్వరరావు నివాసంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో విజయలక్ష్మీ బాధపడుతున్నారు. ఐతే నేడు సడన్ గా ఆమె గుండెపోటుకు గురయ్యారని తెలుస్తుంది.

విజయలక్ష్మీ గారి వయసు 74 సంవత్సరాలుగా తెలుస్తుంది. భార్య మరణంతో వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదనకు గురిఅయ్యారు. విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు