టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”

Published on Apr 26, 2024 11:31 AM IST


టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ దుష్యంత్ కటికనేని దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టార్ మా లో ఈ చిత్రం ఏప్రిల్ 28, 2024 న మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రసారం కానుంది. శివాని నాగారం, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు