బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ‘దొంగాట’?

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న ‘దొంగాట’?

Published on Sep 2, 2015 7:58 PM IST

Dongata
తెలుగు సినీ పరిశ్రమలో కొత్తదనమున్న కథలకు ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. ఈమధ్యే ఆ కోవలోనే ఓ సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ‘దొంగాట’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు లక్ష్మి స్వయంగా నిర్మించడమే కాక, ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మే నెలలో విడుదలైంది. అడవి శేష్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఇక తెలుగులో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ సినిమా, తాజాగా బాలీవుడ్‌లో రీమేక్ కానుందనే వార్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ రీమేక్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయని సమాచారం. తెలుగులో మంచు లక్ష్మి చేసిన పాత్రను హిందీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వంశీ కృష్ణయే బాలీవుడ్ రీమేక్‌కూ దర్శకత్వం వహించనున్నారట. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. తెలుగులో ఓ సరికొత్త కథాంశంగా రూపొందిన ఈ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలతో రూపొందడంతో, దొంగాట హిందీ రీమేక్ తప్పకుండా ఉంటుందనే అభిప్రాయం వెలువడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు