మెగా అభిమానులకు షాక్ ఇవ్వనున్న అల్లు అరవింద్ !

మెగా అభిమానులకు షాక్ ఇవ్వనున్న అల్లు అరవింద్ !

Published on Dec 3, 2016 10:46 PM IST

allu-arvind
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం’ధృవ’ పై సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ పాత రికార్డులు బద్దలు కొట్టి కొత్త రికార్డులు అందుకోవాలని మెగా అభిమానులంతా ఆశగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ వర్షెన్ ‘తనీ ఒరువన్’ పెద్ద హిట్టవడం, కథ యూనివర్సల్ టాపిక్ గా ఉండటం, భారీ స్థాయి క్రేజ్ వంటి అంశాలను నమ్ముకుని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరిగిపోయింది. ఇక రిలీజ్ కు వారం రోజుల గడువు కూడా లేకపోవడంతో అభిమానులంతా 8వ తేదీ అర్థరాత్రి జరగబోయే స్పెషల్ షోలకు రెడీ అవుతున్నారు.

కానీ పరిస్థితి చూస్తుంటే ఈ అర్థరాత్రి స్పెషల్ షోలు జరిగేలా కనిపించడం లేదు. అందుకు కారణం నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయమే. ఎందుకంటే రిలీజ్ కంటే ముందుగా షో వేస్తే టాక్ బయటికొచ్చి కలెక్షన్లపై ప్రభావం పడుతుందని అందుకే అలాంటి షోలు లేకుండా తెల్లవారు జామున షోలతో సినిమాని మొదలుపెట్టాలని అరవింద్ ఆలోచిస్తున్నాడట. పైగా గతంలో బన్నీ’సరైనోడు’ సినిమాకి కూడా అర్థరాత్రి స్పెషల్ షోలు లేకుండా ఉదయాన్నే షోలు వేశారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకే అరవింద్ చెర్రీని కూడా బన్నీ దారిలోనే వెళ్ళమని సూచిస్తున్నాడట. మరి చివరికి ఏ షోలకు పర్మిషన్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు