పరువు నష్టం కేసు వేయనున్న కత్తి నిర్మాతలు

పరువు నష్టం కేసు వేయనున్న కత్తి నిర్మాతలు

Published on Oct 31, 2014 3:30 AM IST

kaththi
కత్తి సినిమా విడుదలైన నాటినుండే కాక విడుదలకు ముందునుండి సైతం ఏదో ఒక చిక్కుల్లో చిక్కుకుంటుంది. సినిమాలో 2G స్కామ్ గురించి వివాదాస్పద వాఖ్యలు చేసినందుకు కోర్టులో కేస్ వేసారు. అయితే పబ్లిసిటీకోసం మేము ఎటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చెయ్యలేదని తెలిపారు. ఈ సినిమా భారీ వసూళ్ళ నడుమ 100కోట్ల మార్కుకి చేరువయ్యింది

అన్నీ సజావుగా సాగుతున్న తరుణంలో గోపీ అనే ఒక చిన్న రచయిత ఈ సినిమా మూల కధ తనదే అంటూ మీడియా ముందుకెక్కాడు. ఈ విషయం పై దర్శకుడు, హీరో పెదవివిప్పకపోయినా వారి ఇమేజ్ ని పాడుచేస్తున్నాడని కత్తి నిర్మాతలు గోపీపై పరువునష్టం దావా వేయనున్నారు

గోపీ గతంలో సైతం ఇలానే కార్తీ నటించిన సూపర్ హిట్ సినిమా ‘మద్రాస్’ తన షార్ట్ స్టోరీలలో ఒకటని ఆరోపించాడు. తెలుగులో సైతం కత్తి తన పదును చూపడానికి సిద్ధపడుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు