కళాతపస్వికి అత్యున్నత పురస్కారం !

కళాతపస్వికి అత్యున్నత పురస్కారం !

Published on Apr 24, 2017 6:17 PM IST


అలనాటి గొప్ప దర్శకుల్లో ఒకరైన కె. విశ్వనాథ్ గారిని మరో పురస్కారం వరించింది. రంగంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ పాల్కే అవార్డును భారత ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఆయనకు ప్రకటించింది. మొదటి సౌండ్ ఇంజనీర్ గా సినిమా ప్రసాతానామ్ మొదలుపెట్టిన విశ్వనాథ్ గారు ఆ తర్వాత అరుంధతి సుబ్బారావుగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

ఆ తర్వాత దర్శకుడిగా మారి ఏఎన్నార్ తో ‘ఆత్మ గౌరవం’ అనే సినిమా తీశారు. ఆయన చేసిన ‘ శంకరాభరణం, సాగర సంఘమం, స్వాతి ముత్యం’ వంటి సినిమాలు ఇప్పటికీ తెలుగు సినీ జగత్తులో క్లాసికల్ హిట్స్ గా నిలిచే ఉన్నాయి. సినిమా రంగానికి చేసిన విశేష కృషికి గాను ‘కళాతపస్వి’ అనే బిరుదు పొందిన ఆయనను 1992లోనే పద్మ శ్రీ అవార్డు వరించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు