‘బాహుబలి’ ని అందుకోవడమే మెగాస్టార్ టార్గెటా ?

‘బాహుబలి’ ని అందుకోవడమే మెగాస్టార్ టార్గెటా ?

Published on Aug 17, 2017 8:43 AM IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేయబోనున్న తన 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ దక్షిణాదిన హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్ తో, ప్రముఖ తారాగణంతో రూపొందనున్న ఈ చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా క్యాంప్ కూడా అందుకు తగ్గట్టే భారీ ప్రిపరేషన్స్ తో రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్ని పూర్తి చేసిన టీమ్ అగ్ర పరిశ్రమల నుండి నటీ నటుల్ని తీసుకునే పనిలో నిమగ్నమైంది.

ముందుగా బాలీవుడ్ నుండి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకున్న టీమ్, తమిళం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతారను, కన్నడ నుండి స్టార్ నటుడు సుదీప్ ను ఎంచుకుంది. అంతేగాక సంగీతం ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహామన్ ను, సినిమాటోగ్రఫీ కోసం రవి వర్మన్ ను తీసుకుంది. ఇలా జాతీయ స్థాయి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ప్రాజెక్టులోకి తీసుకోవడం చూస్తే మెగాస్టార్ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ‘బాహుబలి’ ని అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నారనిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక వారి ఉద్దేశ్యమైతే తెలుగు పరిశ్రమ కీర్తి ఇంకాస్త పెరగడం ఖాయం.

చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు