తుదిదశకు చేరుకున్న నాగచైతన్య తదుపరి చిత్రం

తుదిదశకు చేరుకున్న నాగచైతన్య తదుపరి చిత్రం

Published on Jan 30, 2015 2:50 PM IST

Naga-Chaitanyas-first-look
‘ఒక లైలా కోసం’ సినిమాతో రొమాంటిక్ హిట్ సాధించిన నాగచైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం కొన్ని ముఖ్యసన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమా యొక్క టీజర్ గతఏడాది విడుదలచేశారు. కనిపించినది కొన్ని సెకన్లే అయినా నాగచైతన్య సినీ ప్రియులను ఆకట్టుకుంది. కామన్ మెన్ గా చైతూ కనిపించనున్నాడు. కృతి సనన్ హీరోయిన్. బి.వి.ఎస్.ఎన్ ప్రాసాద్ నిర్మాత. స్వామి రారా చిత్రానికి పనిచేసిన బృందమే ఈ చిత్రానికి సైతం పనిచెయ్యడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు