మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ‘బెంగాల్ టైగర్’ సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయింది. కాగా ఇప్పటికీ ఆయన తన కొత్త సినిమాను మాత్రం మొదలుపెట్టలేదు. ఈ గ్యాప్లో ఎన్నో సినిమాలు సెట్స్పైకి వెళ్ళేట్లు కనిపించినా ఏదీ నిజమవ్వలేదు. తాజాగా మొత్తానికి ఒక సినిమా ఇప్పటికి అధికారికంగా ప్రకటించబడింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై వంశీ, నల్లమలుపు శ్రీనివాస్ నిర్మించనున్న ఈ సినిమాతో విక్రమ్ సిరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇక ఈ సినిమాతో బాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరైన ప్రీతమ్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారట. బాలీవుడ్లో పలు తిరుగులేని మ్యూజిక్ హిట్స్ ఇచ్చిన ప్రీతమ్, తెలుగులో ఎలా మెప్పిస్తారన్నది చూడాలి. రవితేజ సరసన రాశిఖన్నా హీరోయిన్గా నటించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది.