యూఎస్ లో ల్యాండ్ అయిన చరణ్ !

యూఎస్ లో ల్యాండ్ అయిన చరణ్ !

Published on Dec 8, 2016 9:00 PM IST

charan-at-usa
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నడూ లేని విధంగా ఈసారి యూఎస్ బాక్సాఫీస్ మీద కన్నేశాడు. ఇప్పటి వరకూ తన సినిమాలేవీ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయకపోవడంతో పని గట్టుకుని మరీ స్వయంగా రంగంలోకి దిగి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అందులో భాగాంగానే లోకల్ ప్రమోషన్లని ముగించుకుని ఈరోజే యూఎస్ బయలుదేరి వెళ్లి కొద్దిసేపటి క్రితమే అక్కడ ల్యాండ్ అయ్యారు. చరణ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వగానే ఎంగా అభిమానుల టీమ్ ఆయనకు, దర్శకుడు సురేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. చరణ్ కూడా అభిమానులతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి తన ప్లేస్ కి వెళ్లిపోయారు.

ఇండియా టైమింగ్ ప్రకారం రేపు తెల్లవారు జామున 4 గంటల సమయం నుండే ప్రీమియర్లు మొదలవుతాయి. చరణ్ రేపటి నుండి అమెరికాలోని పలు ప్రాంతాల్లో ‘ధృవ’ ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు వెళ్లి అభిమానులతో కాసేపు ముఖాముఖి మాట్లాడుతారు. యూఎస్ లో ఉన్న మెగా అభిమానాలు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు