ప్రత్యేకం : ‘పెళ్ళికాని ప్రసాద్’ అవతారం ఎత్తిన వెంకటేష్

ప్రత్యేకం : ‘పెళ్ళికాని ప్రసాద్’ అవతారం ఎత్తిన వెంకటేష్

Published on Nov 26, 2014 2:19 PM IST

venkatesh
‘పెళ్ళికాని ప్రసాద్’ ఈ పేరు విక్టరీ వెంకటేష్ నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాలో బాగా ఫేమస్ అయిన పేరు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే వేకటేశ్ చేయబోయే తదుపరి సినిమా టైటిల్ అది అని అనుకున్నారో.. మీరు పప్పులో కాలేసినట్టే.. అసలు విషయంలోకి వెళితే వైజాగ్ హుదూద్ బాధితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్స్ అందరూ ముందుకు వచ్చి ‘మేము సైతం’ అనీ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

జస్ట్ స్టార్స్ అంతా అతిధుల్లాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ స్టేజ్ పై పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకూ ప్రతి ఒక్కరూ డాన్స్, కామెడీ స్కిట్స్, పలు నాటకీయ ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ స్పెషల్ కామెడీ స్క్రిప్ట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడు. వెంకటేష్ బ్రహ్మానందం, అలీతో కలిసి చేయనున్న ప్రోగ్రాంకి ‘పెళ్ళికాని ప్రసాద్’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ స్క్రిప్ట్ చివర్లో కాజల్ అగర్వాల్ చీఫ్ గెస్ట్ గా వచ్చేలా స్క్రిపి ని డిజైన్ చేసారు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ అందించిన ఈ స్క్రిప్ట్ కి సంబందించిన రిహార్సల్స్ ని మొదలు పెట్టాల్సి ఉంది.

నవంబర్ 30వ తేదీన జరగనున్న ఈ టెలీథాన్ కార్యక్రమం కంటిన్యూగా 12 గంటల పాటు లైవ్ గా జరగనుంది. ఇందులో భాగంగా క్రికెట్ మ్యాచ్, కబడ్డీ, మెగా డ్రా, తంబోలా ఈవెంట్స్ కూడా జరగనున్నాయి. వాటిల్లో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే మీరు memusaitam.com లోకి వెళ్లి టికెట్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు