సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విఐపి-2’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘విఐపి-2’ !

Published on Jul 20, 2017 6:22 PM IST


ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ‘విఐపి-2’. 2014లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘రఘువరన్ బిటెక్’ కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇకపోతే ముందుగా ఈ సినిమాను జూలై 28న రిలీజ్ చేయాలనుకోగా అది కాస్త ఆగష్టుకు వాయిదా పడింది. అందుకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే తమిళ, తెలుగు, హిందీ వెర్షన్ల సెన్సార్ పనులేనని తేలింది. మరిప్పుడు తమిళ సెన్సార్ ముగించుకున్న ఈ సినిమా హిందీ, తెలుగులో కూడా ఆ పనుల్ని పూర్తి చేసుకుని ముందుగా ఏమైనా విడుదలవుతుందో లేదో చూడాలి. సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు