కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా యంగ్ హీరోయిన్ మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామానే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సాలిడ్ మాస్ హిట్ వచ్చిన తర్వాత క్లాస్ సినిమా ఎలా ఉంటుందో అనే ప్రశ్నకి ఏకంగా 250 కోట్లకి పైగా గ్రాస్ ని సూర్య అందించి అదరగొట్టాడు. దీనితో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య సినిమా ఇప్పుడు థియేటర్స్ నుంచి ఓటిటిలోకి వచ్చేసింది.
ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా లెవెల్లోకి వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఓటిటిలో ఈ చిత్రం చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా సాయి సౌజన్య, సూర్య దేవర నాగవంశీలు సంయుక్తంగా నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
