డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న పూరి తనయుడి సినిమా

డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న పూరి తనయుడి సినిమా

Published on Oct 15, 2014 7:00 PM IST

Puri-jagannath-and-Akash
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ ఇప్పటి వరకూ ‘గబ్బర్ సింగ్’, ‘బుజ్జిగాడు’, ‘ధోని’ మొదలైన సినిమాలలో నటించాడు. ఇప్పుడు తనే లీడ్ రోల్ లో ఒక టీనేజ్ లవ్ స్టొరీ చేయనున్నాడని ఇది వరకె తెలియజేశాం. ఈ సినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘టైం పాస్’ మూవీకి రీమేక్.
తెలుగులో ‘ఋషి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని ప్రసాద్ ప్రొడక్షన్స్ పై రమేష్ ప్రసాద్ నిర్మించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 10 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరాఠీలో కేవలం 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకి చెందిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు