మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!

మరోసారి మైత్రీ తో చేతులు కలుపుతున్న ప్రదీప్ రంగనాథన్..!

Published on Apr 2, 2026 9:00 AM IST

LIK

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నాడు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ‘డ్యూడ్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్, ఇప్పుడు మరోసారి అదే అగ్ర నిర్మాణ సంస్థతో చేతులు కలిపాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

​ఈ చిత్రానికి వైవిధ్యమైన సినిమాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించనున్నారు. ప్రదీప్ మార్క్ యూత్‌ఫుల్ ఎనర్జీకి, యేలేటి మార్క్ ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే తోడైతే సినిమా సరికొత్తగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్నారు.

​మరోవైపు, ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా కోసం ఏకంగా రూ.50 కోట్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఆయన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) విడుదలకు సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ యంగ్ స్టార్, తెలుగు మార్కెట్‌పై కూడా పట్టు సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు