సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇండియన్ సినిమాలో దర్శకుడిగా తనదైన బ్రాండ్ను సృష్టించుకున్న దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ల కాంబినేషన్లో ఓ సినిమాకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేష్ స్టార్డమ్కు సరిగ్గా సరిపోయేలా మురుగదాస్ ఓ బలమైన కథను సిద్ధం చేశారట. ఇక ఈ సినిమాను టెక్నికల్గా కూడా బలంగా నిలబెట్టేందుకు దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ను ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జాతీయ అవార్డు గ్రహీత అయిన టాప్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ను మహేష్-మురుగదాస్ల కాంబో సినిమాకు సినిమాటోగ్రాఫర్గా ఖరారు చేశారు. ఈ విషయాన్ని సంతోష్ శివన్ స్వయంగా ఈ ఉదయం ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా హారీస్ జయరాజ్ను ఖరారు చేసినట్లు సమాచారం. మొదట రహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తారన్న ప్రచారం జరిగినా, తాజాగా హారీస్ జయరాజ్నే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
న్యాయ వ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపే సినిమాగా ఈ సినిమా ఉండనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక అఫీషియల్గా అనౌన్స్ కూడా కాకముందే ఈ స్థాయి ఆసక్తి రేకెత్తిస్తోన్న ఈ సినిమా, సమ్మర్ తర్వాత సెట్స్పైకి వెళ్ళనుంది.