రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వైశాఖం చిత్రం గత కొన్ని నెలలుగా మంచి బజ్ ని క్రియేట్ చేస్తోంది. తాజగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని జులై 21 న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.
యువనటులు హరీష్, అవంతిక మిశ్రాలు ఈ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర థీమ్ టీజర్ 3 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. చిన్న చిత్రమైన వైశాఖం కు ఇది మంచి రికార్డ్. బి జయ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి ఏ రాజు నిర్మిస్తున్నారు.


