గతేడాది ‘అనగనగ ఒక దుర్గ’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన దర్శకుడు ప్రకాష్ పులిజాల మారాక చిత్రానికి సిద్ధమవుతున్నారు. మొదటి సినిమాతోనే సామాజిక స్పృహ ఉన్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న ఈయన ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకురానున్నారు.
జూలై నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా ఇందులో ప్రముఖ హీరోయిన్ ఒకరు ప్రధాన పాత్ర పోషించనుందని, కథ, కథనం అన్నీ సక్రమంగా కుదిరాయని, త్వరలోనే చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తానని ఆయనే స్వయంగా తెలిపారు.


