సమ్మర్ లో రానున్న సైరా !

సమ్మర్ లో రానున్న సైరా !

Published on Jun 3, 2018 10:33 AM IST

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నర్సింహా రెడ్డి’ .ఈ సినిమాని స్వాతంత్ర్య సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఆ సమయంలో సినిమాల రిలీజ్ తక్కువగా ఉండడంతో సమ్మర్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది చిత్ర యూనిట్.

అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , తమన్న , సుదీప్ మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది షూటింగ్ కంప్లిట్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు. నయన తార ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు