ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన ‘భరత్ అనే నేను’ చిత్రం మరోసారి వివాదాల్లోకెక్కింది. ఇప్పటికే ఒక రచయిత ‘భరత్ అనే నేను’ చిత్ర కథ నాదే అంటూ రచయితల సంఘంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక వివాదం ఈ చిత్రాన్ని చుట్టుముట్టింది.
చిత్రంలో ‘నవోదయం’ పార్టీ పేరును, గుర్తును వాడి ‘నవోదయం’ పార్టీ అవినీతిమయం అన్నట్లుగా చూపించారని ‘నవోదయం’ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఆరోపించారు. గుంటూరు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు కూడా చేశారు. మరి ఈ వివాదాంపై దర్శక నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


