శ్రీ విష్ణు హీరోగా ‘నీది నాది ఒకే కథ’ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న దర్శకుడు ‘వేణు ఉడుగుల’ ఇప్పుడు ఈయన తన రెండో చిత్రంగా శర్వానంద్, సాయిపల్లవిలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం 1992’ అనే పీరియాడికల్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ ను మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు వేణు.1990ల నేపథ్యంలో నడిచే ఈ ప్రేమ కథలో శర్వానంద్, సాయిపల్లవిల పాత్రలు చాలా అద్భుతంగా వచ్చాయట.
ముఖ్యంగా శర్వా, సాయిపల్లవిల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాల్లోని సంఘర్షణ హృదయాన్ని పిండేసేలా చాలా ఎమోషనల్ గా ఉంటందని సమాచారం. వేణు ‘నీది నాది ఒకే కథ’ చిత్రంలో కూడా హీరో క్యారెక్టర్ మీదే చిత్రాన్ని నడిపించాడు. వేణు రాసుకున్నే పాత్రలన్నీ ఎంతో భావోద్వేగంతో నిండి ఉంటాయి. ప్రస్తుతం శర్వానంద్, సాయిపల్లవి హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడిపడి లేచే మనసు’ చిత్రంలో నటిస్తున్నారు.