ఛలో, గీత గోవిందం లాంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుని టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రష్మిక మందన. ప్రస్తుతం రష్మిక మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `గీతా .. ఛలో` అనే సినిమాతో ఈ నెల 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ కన్నడ బ్యూటీ.
కాగా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ `గీతా .. ఛలో` చిత్రాన్ని దివాకర్ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్ – మూవీ మాక్స్ బ్యానర్ల పై మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా అందిస్తున్నారు. మరి తన ‘ఛలో’, ‘గీత గోవిందం’ చిత్రాల్లాగే ఈ చిత్రం కూడా హిట్ అవుతుందేమో చూడాలి.