అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ అప్పుడే సగానికి పైగా .. !

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ అప్పుడే సగానికి పైగా .. !

Published on Apr 19, 2019 1:00 AM IST

టాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ అర్జున్ రెడ్డి ఇప్పుడు కోలీవుడ్ లో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో భణిత సంధు హీరోయిన్ గా నటిస్తుంది.

ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గిరీశయ్య ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పోర్చుగల్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మార్చిలో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికే 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈసినిమాను రీమేక్ చేయడం ఇది రెండవ సారి. ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ఈచిత్రాన్ని రీమేక్ చేసిన అవుట్ ఫుట్ నచ్చకపోవడంతో హీరో ను తప్ప మిగతా అందరిని మార్చి మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు