‘ఛలో’ లాంటి చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రస్తుతం ఇటీవలే సెకెండ్ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఈ షెడ్యూల్ లో దర్శకుడు రమణ తేజ విజన్ కి తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఈ నెల మూడో వారం నుండి హైదరాబాద్ లో మూడో షెడ్యూల్ మొదలవ్వబోతుందని.. ఈ షెడ్యూల్ తో సినిమాలోని కీలక సన్నివేశాలు పూర్తవుతాయని తెలుస్తోంది.
ఇక నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహరిన్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల అలరించబోతుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ, ప్రొడ్యూసర్ ఉషా ముల్పూరి.