తమిళ్ స్టార్ హీరో సూర్య తండ్రి శివకుమార్ సోషల్ మీడియాలో టీటీడీ పై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శివకుమార్ మాట్లాడుతూ.. ‘తిరుమలలో డబ్బులున్నవారికే మాత్రమే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్ హౌస్లు ఇస్తారని.. అదే సామాన్యులకు మాత్రం దర్శనం కూడా కల్పించకుండా తోసేస్తారని శివకుమార్ కామెంట్స్ చేశారు. పైగా అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని శివకుమార్ ఎదురు ప్రశ్నించారు.
కాగా టీటీడీ పై దుష్ప్రచారం చేశారని, తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తిరుమలకు వెళ్లొద్దంటూ శివకుమార్ అసత్య ప్రచారం చేశారని, తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో శివకుమార్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీటీడీ పై దుష్పచారం పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి శివకుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.