పవన్ కళ్యాణ్ ఈసారి సీమ ట్రీట్ ఇస్తారన్నమాట

పవన్ కళ్యాణ్ ఈసారి సీమ ట్రీట్ ఇస్తారన్నమాట

Published on Apr 13, 2021 8:08 PM IST

ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ చేస్తున్నారు. ఇందులో దగ్గుబాటి రానా ఒక కీలక పాత్ర చేస్తున్నారు. పవన్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో ఈ రీమేక్ మీద ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇందులో పవన్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన రాయలసీమ యాసలో మాట్లాడతారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ లిరిసిస్ట్ ఒకరు ఆయనకు సహాయం అందిస్తున్నారట.

తెలుగులోని ఏ యాసలో అయినా మాట్లాడగల నేర్పు పవన్ కు ఉంది. పైగా సీమ యాసలో పవన్ సినిమా చేయడం ఇదే తొలిసారి. ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడ తెలంగాణ డిక్షన్ ట్రై చేసి మెప్పించారు. అంతేకాదు ఈ రీమేక్ సినిమాలో పవన్ ఒక పాట కూడ పాడనున్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ స్వయంగా తెలిపారు. పవన్ పాడుతున్నారు అంటే అది తప్పకుండా జానపద గీతమే అయ్యుంటుంది. మొత్తానికి పవన్ తన సినిమా ప్రేక్షకులకు వరుస సప్రైజెస్ ఇవ్వనున్నారన్నమాట. త్రివిక్రమ్ కథనం, మాటలు అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం వరకు పూర్తైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు