తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న “చంద్రముఖి 2”

తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న “చంద్రముఖి 2”

Published on Aug 9, 2022 4:13 PM IST


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి తమిళం, తెలుగు భాషల్లో క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, మేకర్స్ రాఘవ లారెన్స్‌తో చంద్రముఖి 2 ను ప్రకటించారు. ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తాజా అప్డేట్ ఏమిటంటే, ఈరోజు ముందుగా మైసూర్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించారు. చంద్రముఖి 2లో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ హారర్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. గత కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ ఆశీస్సులు తీసుకొని షూటింగ్ ప్రారంభించారు లారెన్స్. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు