విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు నటిస్తున్న మల్టి స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకీ సరసన అమలా పాల్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. వెంకీ మరియు మహేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారు. వెంకీ భార్య పాత్ర కోసం చాలా మంది హీరోయిన్సును సంప్రదించగా చివరికి అమలా పాల్ ఓకే చేసినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న మల్టి స్టారర్ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం ప్రారంభం కానున్న ఈ చిత్రంలో వెంకీ-మహేష్ కి తండ్రిగా ప్రకాష్ రాజ్ చేయబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- బ్రేకింగ్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ ఎదురు చూపులకి తెర పడింది..
- రవితేజ, అనుదీప్ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారా!?
- “ఇండియన్ 2” రిలీజ్ ముందు వింటేజ్ ట్రీట్ ప్లానింగ్?
- సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ డేట్ ఫిక్స్
- గోపీచంద్ “భీమా” హిందీ వెర్షన్.. ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో
- 14 ఏళ్ళ తరువాత స్టార్ యాక్టర్ – స్టార్ డైరెక్టర్ కాంబో మూవీ ఫిక్స్ ?