క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న T20 World Cup 2026 లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ Match విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త రాగాన్ని ఎత్తుకుంది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్తో మ్యాచ్ను Boycott చేస్తామని పాక్ బెదిరించడంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రంగంలోకి దిగింది.
T20 World Cup 2026 – అసలు గొడవ ఏంటి?
భారత్లో మ్యాచ్లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది. దీనికి నిరసనగా, పాకిస్తాన్ ఇప్పుడు “మేము కూడా భారత్తో మ్యాచ్ ఆడము” అంటూ భీష్మించుకు కూర్చుంది. పాకిస్తాన్ తన మ్యాచ్లన్నీ శ్రీలంకలో (హైబ్రిడ్ మోడల్లో) ఆడుతున్నప్పటికీ, భారత్తో జరిగే మ్యాచ్ను మాత్రం బహిష్కరిస్తామని ప్రకటించడం ఇప్పుడు Hot Topic అయ్యింది.
లాహోర్లో కీలక మీటింగ్ – 24 గంటల డెడ్లైన్
ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ, పీసీబీ మరియు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. బంగ్లాదేశ్ బోర్డు చీఫ్ అమీనుల్ ఇస్లాం ఇప్పటికే లాహోర్ చేరుకున్నారు. ఐసీసీ అధికారులతో పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. భారత్తో మ్యాచ్ ఆడాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం (Final Call) తీసుకోవడానికి పాకిస్తాన్కు 24 గంటల Deadline విధించినట్లు సమాచారం.
ఐసీసీ సీరియస్ వార్నింగ్
ఒకవేళ పాకిస్తాన్ గనక ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.
Financial Loss: మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్కు రావాల్సిన రెవెన్యూ షేర్ను నిలిపివేస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.
Force Majeure: పాక్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ పీసీబీ “Force Majeure” (అనివార్య కారణాల) క్లాజ్ను తెరపైకి తెచ్చింది. కానీ, దీనికి తగిన ఆధారాలు చూపాలని ఐసీసీ డిమాండ్ చేసింది.
ప్రస్తుతం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ బిగ్ Fight యథావిధిగా జరిగే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా సరే, రాబోయే 24 గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.


