శబ్దం ఓటీటీ.. అందులో కూడా వచ్చేసింది.. కానీ..!

శబ్దం ఓటీటీ.. అందులో కూడా వచ్చేసింది.. కానీ..!

Published on Apr 4, 2026 9:00 PM IST

Sabdham

ట్యాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి లీడ్ రోల్‌లో నటించిన హారర్ థ్రిల్లర్ ‘శబ్దం’ డిజిటల్ రిలీజ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2025 ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ రివెంజ్ డ్రామాకు అప్పట్లో మిక్సిడ్ టాక్ లభించింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ డిజిటల్ రిలీజ్ తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తమిళ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తాజాగా హిందీ వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, తెలుగు వెర్షన్ జాడ లేకపోవడంతో ఆది పినిశెట్టి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నటుడు కావడంతో, ఈ చిత్రాన్ని తమ మాతృభాషలో వీక్షించాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈ ఆలస్యం అంతుచిక్కడం లేదు.

లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా తదితరులు నటించిన ఈ చిత్రానికి అరివళగన్ దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందించాడు. మరి ఈ సినిమా తెలుగు వెర్షన్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే దానిపై జీ5 నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు