సల్మాన్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్!

సల్మాన్, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్!

Published on Apr 16, 2026 2:59 PM IST

రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో అనౌన్స్ చేసిన సినిమా కూడా ఒకటని చెప్పాలి. అనౌన్సమెంట్ తో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా తాలూకా షూట్ ఎప్పుడు నుంచి మొదలు కానుంది? ఇతర కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.

మేకర్స్ ఈ సినిమా తాలూకా మొదటి షెడ్యూల్ ని ఈ ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు చేయనున్నారట. ఇందుకోసం ఓ ఇంటి సెట్ ని కూడా వేసారట. అలానే ఈ షెడ్యూల్ లోనే ఒక వింటేజ్ సాంగ్ ని సల్మాన్ తో వంశీ పైడిపల్లి ప్లాన్ చేశారట. సో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని కూడా వంశీ తనదైన శైలిలో తీసుకెళ్లనున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు