కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా హీరోయిన్ మమితా బైజు కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఒక క్లాస్ సినిమా అయినప్పటికీ భారీ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. ఆల్రెడీ గంటకి 30 వేలకి పైగా టికెట్ సేల్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం బుకింగ్స్ లో అప్పుడే సెన్సేషనల్ మార్క్ దాటేసింది.
ఒక్క బుక్ మై షో యాప్ లోనే సినిమా రెండో రోజు పూర్తి కాకుండానే ఏకంగా 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో సూర్య క్లాస్ సినిమాతో కూడా ర్యాంపేజ్ చూపిస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ లో కరుప్పు ని ఈ సినిమా క్రాస్ చేసినా ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించారు.
#VishwanathAndSons is turning every show into a beautiful celebration 💥💥
1 Million+ Tickets Sold on @bookmyshow and setting the box office ablaze ❤️🔥❤️🔥#BlockbusterVAS #BlockbusterVishwanathAndSons @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena… pic.twitter.com/u9ij6AeeH0
— Sithara Entertainments (@SitharaEnts) August 15, 2026


