మైత్రి లో మిస్టర్ మజ్ను దర్శకుడు !

మైత్రి లో మిస్టర్ మజ్ను దర్శకుడు !

Published on Jan 20, 2019 6:00 PM IST

శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ ,రంగస్థలం చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను సాధించిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇటీవల అమర్ అక్బర్ ఆంటోనీ , సవ్యసాచి చిత్రాల రూపంలో పరాజయాలను చవిచూసింది. ఇక ప్రస్తుతం ఈ సంస్థ డియర్ కామ్రేడ్ , చిత్ర లహరి అనే చిత్రాలను నిర్మిస్తుంది. ఈ చిత్రాలతో పాటు కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో ఒక సినిమా నిర్మించాల్సి వుంది.

ఇక ఇప్పుడు మరో యంగ్ ట్యాలెంటెడ్ దర్శకుడికి మైత్రి అవకాశం ఇచ్చింది. తొలిప్రేమ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం మిస్టర్ మజ్ను చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రం తరువాత ఈ దర్శకుడు ,మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానేర్ లో తన మూడవ చిత్రాన్ని చేయనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబందించిన వివరాలు అధికారికంగా వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు