‘అల వైకుంఠపురములో…’ బజ్ పెరిగింది !

‘అల వైకుంఠపురములో…’ బజ్ పెరిగింది !

Published on Aug 16, 2019 2:00 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్’ 19వ సినిమాకి ‘అల వైకుంఠపురములో’ అని టైటిల్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ రోజు ఉదయం విడుదలచేశారు. సాధారణంగా త్రివిక్రమ్ చిత్రాల టైటిల్స్ కి క్రేజ్ బాగా ఎక్కువ. అలాంటిది అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎలాంటి టైటిల్ పెట్టనున్నారా అనే ఆసక్తి బాగా పెరిగింది. అందరి అంచనాలకు మించిన మంచి టైటిల్ కుదరడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నారు. సినిమా కథకు సరిగ్గా సరిపోవడం… అల్లు అర్జున్ ఇమేజ్ కు ఏమాత్రం తీసిపోని ఈ టైటిల్ తో సినిమాకు మరింత బజ్ పెరిగింది. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర టైటిల్ కూడా ఫెస్టివల్ మూడ్ కి సరిగ్గా సరిపోవడం కలిసి వచ్చే మరో అంశం.

ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ ఎనర్జీ, కామెడీ టైమింగ్ కి, త్రివిక్రమ్ మాటల తూటాలు కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లోని కామెడీనే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వీరిద్దరూ రాబోతున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు