మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘22’కి దివంగత దర్శకురాలు బి.జయ తనయుడు శివకుమార్.బి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఈ రోజు నుంచి మూవీ ఎడిటింగ్ ని మొదలెట్టనున్నారు.
ఇక ‘బాహుబలి’, ‘ఖైదీ నెం 150’, ‘సాహో’ చిత్రాలకి వర్క్ చేసిన జాషువా యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయట. ఈ సినిమా టైటిల్ ‘22’ అనేది ఒక నెంబర్. ఆ నెంబర్కి ఒక కీ ట్విస్ట్ ఉందట. ఓ మర్డర్ మిస్టరీతో మిక్స్ అయిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా అని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో విక్రమ్ జీత్, జయప్రకాష్, రాజేశ్వరి నాయర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బి.వి. రవికిరణ్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: శ్యామ్ వాడవల్లి, యాక్షన్: స్టంట్ జాషువా, నిర్మాత: సుశీలా దేవి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివకుమార్ బి.