“ఆచార్య” కోసం భారీ ఖర్చుతో రియాలిటీ సెట్.!

“ఆచార్య” కోసం భారీ ఖర్చుతో రియాలిటీ సెట్.!

Published on Nov 26, 2020 10:00 AM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస విజయ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. కొరటాల లైనప్ లానే మాస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మొత్తానికి చాలా కాలం అనంతరం తిరిగి షూటింగ్ మొదలు అయ్యింది. ఇక ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రానికి గనుఁ మేకర్స్ ఏకంగా నాలుగు కోట్ల బడ్జెట్ తో ఒక అదిరిపోయే సెట్ ను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అది దేని కోసమో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు కానీ చాలా రియలిస్టిక్ గా ఈ సెట్ ను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే పలు దేవాలయాలు సెట్స్ ను మేకర్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి అందుకు సంబంధించినవే కాకపోతే భారీవి నిర్మిస్తున్నట్టు టాక్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు