మహాశివరాత్రికి ముహూర్తం పెట్టుకున్న మెగాస్టార్

మహాశివరాత్రికి ముహూర్తం పెట్టుకున్న మెగాస్టార్

Published on Mar 6, 2021 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రం శరవేగంగా పనులను పూర్తిచేసుకుంటోంది. మే 13న సినిమా రిలీజ్ ఉండటంతో ప్రమోషన్లు కోడ్ మొదలుపెట్టారు టీమ్. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకోగా త్వరలో రామ్ చరణ్ లుక్ రివీల్ చేయనున్నారు. ఇక మార్చి 11న మహాశివరాత్రి పర్వదినం సందర్బంగా సినిమా నుండి బిగ్ అప్డేట్ రానుంది. అదే ఫస్ట్ సింగిల్.

సినిమా నడిచేది దేవాదాయశాఖ, ఆలయాల నేపథ్యంలో కాబట్టి సినిమాలో భక్తి భావం మెండుగా ఉంటుంది. సినిమాలో శివుడి మీద ఒక మంచి డివోషనల్ సాంగ్ ఉందట. దాన్నే శివరాత్రి కానుకగా విడుదలచేస్తారని తెలుస్తోంది. ఈ విషయమై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇక కొరటాల శివ సామాజిక అంశాలను డీల్ చేసే తీరే వేరే లెవల్లో ఉంటుంది. ఈసారి ఆయన ఆలయాల మీద సినిమా చేస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్, పూజా హెగ్డేలు కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు