గులాబీ హీరోయిన్ ఎట్టకేలకు దర్శనమిచ్చింది

గులాబీ హీరోయిన్ ఎట్టకేలకు దర్శనమిచ్చింది

Published on Sep 4, 2019 2:41 PM IST

నటి మహేశ్వరి నటిచింది కొద్దిసినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఉంగరాల జుట్టు, తేనే కళ్ళు, విభిన్నమైన స్వరం కలిగిన మహేశ్వరీ సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉండేది. గులాబీ చిత్రంలో ఆమె, చక్రవర్తి మధ్య వచ్చే “ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో” అల్ టైం క్లాసిక్ గా సాంగ్ గా మిగిలిపోయింది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గులాబీ మంచి విజయం సాధిచింది.

తెలుగులో మహేశ్వరీ పెళ్లి, దెయ్యం, ప్రియరాగాలు,మా అన్నయ్య, వంటి హిట్ చిత్రాలలో నటించారు. చివరిసారిగా ఆమె తెలుగులో తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో నటించారు. 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాక వెండి తెరకు దూరమయ్యారు. ఐతే పెళ్లి తరువాత ఆమె కొన్ని తమిళ సీరియల్స్ లో నటించారు. వాటిలో ఒకటి తెలుగులో కూడా ప్రసారం అయ్యింది. ఐతే 2014 తరువాత అటు వెండి తెరకు, బుల్లి తెరకు దూరమై అభిమానులకు కనుమరుగయ్యారు మహేశ్వరి.

చాలా కాలం తరువాత నటి శ్రీదేవి మైనపు విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా దర్శనమిచ్చారు.పెళ్లి తరువాత కొంచెం బొద్దుగా తయారైనా ఆమె అందం మాత్రం చెక్కుచెదరలేదు. శ్రీదేవి మహేశ్వరికి దగ్గిర బంధువు కావడంతో బోని కపూర్, జాన్వీ, ఖుషి లతో కలిసి మహేశ్వరి కూడా సింగపూర్ వెళ్లడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు