“గం గం గణేశా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“గం గం గణేశా” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 28, 2024 3:00 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు. మే 31, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది.

ఈ ఈవెంట్ కి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు. తన ఫేవరేట్ కో స్టార్ రౌడీ బాయ్ అని అన్నారు. అంతేకాక గం గం గణేశా చిత్రం సక్సెస్ అయితే, ఆనంద్ దేవరకొండ ఫేస్ లో స్మైల్ వస్తుంది అని, ఆ స్మైల్ చూడాలని కోరుకుంటున్నా, సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు