చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించి, జర్నీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ, పాత్ర ఎలాంటిదైనా తనలోని నటుడ్ని నిరూపించుకుంటూ వచ్చి హీరో స్థాయికి ఎదిగిన నటుడు అడివి శేష్. హీరో కాకముందు నెగెటివ్ రోల్స్ సైతం చేశాడు ఈ యంగ్ హీరో.
వాటిలో పవన్ నటించిన ‘పంజా’ ప్రధానమైనది. అందులో శేష్ నటనకు మంచి ప్రసంశలే అందాయి. కానీ అలాంటి నెగెటివ్ పాత్రలు మళ్లీ చేయనంటున్నాడు శేష్. వరుసగా ‘క్షణం, గూఢచారి, ఎవరు’ లాంటి విజయాలతో హీరోగా నిలదొక్కుకున్న శేష్ ఇకపై కథానాయకుడి పాత్రలే చేయాలనుకుంటున్నారట. అందుకే నెగెటివ్ రోల్స్ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారు కాబోలు.
ప్రస్తుతం ‘మేజర్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న శేష్ దాని తర్వాత ‘గూఢచారి 2’ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు.