వచ్చే ఏడాది రిలీజ్ కి రెడీ అవుతోన్న అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ల భారీ చిత్రం!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత కొన్ని విడుదలలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాలతో ముగిశాయి. ఒకప్పుడు వరుసగా విజయవంతమైన చిత్రాలను అందించిన ఈ నటుడు ఇప్పుడు ఓపెనింగ్స్ రాక ఇబ్బంది పడుతున్నాడు. అక్షయ్ కుమార్ రాబోయే సినిమాలలో, బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద భారీ స్కోర్ చేయడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ చిత్రం 2024 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని ధృవీకరించబడింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరో టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఎక్సోటిక్ లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా షారూఖ్ ఖాన్ యొక్క డుంకీ తో పాటు సినిమా విడుదల అవుతుందని ఊహించారు. కానీ మేకర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్, మానుషి చిల్లర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version