స్టార్ హీరో ‘లక్ష్మీబాంబ్’ బాగా పలికింది ?

స్టార్ హీరో ‘లక్ష్మీబాంబ్’ బాగా పలికింది ?

Published on May 30, 2020 11:04 PM IST

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ జంటగా వస్తోన్న ‘లక్ష్మీబాంబ్’ చిత్రం త్వరలో హాట్స్టార్లో డైరెక్ట్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ మేరకు ఈ చిత్రం ఓటీటీ హక్కులను హాట్ స్టార్ సంస్థ 125 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. థియేటరికల్ రిలీజ్ లేకపోవడం వల్ల ఏకంగా ఈ సినిమాకి 125 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ వార్త పై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

కాగా థియేటర్స్ బంద్ కారణంగా ఇప్పట్లో మూవీ విడుదల చేసే పరిస్థితి లేదు. దీనితో లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని ఓ టి టి లో విడుదల చేయాలని అక్షయ్ భావించారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి, త్వరగా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి తేవాలనేది అక్షయ్ ఆలోచనట. ఇక తెలుగు తమిళ భాషలో విజయం సాధించిన కాంచన చిత్రానికి హిందీ రీమేక్ గా లక్ష్మీ బాంబ్ తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు