టాలీవుడ్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ను చిత్రబృందం దిగ్విజయంగా పూర్తి చేసింది.
పలు ఫన్నీ సన్నివేశాలతో ఈ మొదటి షెడ్యూల్ను కంప్లీట్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పూర్తిస్థాయి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిర్మాణ విలువలకు ఎక్కడా రాజీ పడకుండా షైన్ స్క్రీన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
ఇక మొదటి షెడ్యూల్తోనే పూర్తి పాజిటివ్ వైబ్స్ నింపుకున్న ఈ భారీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ మరోసారి వెల్లడించారు.
Swinging left to right…
and signing off the first schedule in blockbuster style ❤️🔥Team #VenkyANIL5 – #NKRAR2 has successfully wrapped up an exciting first schedule, canning some absolute fun-filled and entertaining sequences🤩💥
SANKRANTHI 2027 RELEASE😎🔥
Victory… pic.twitter.com/hZSbi4gTv1
— Shine Screens (@Shine_Screens) July 23, 2026


