టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ప్రాణంఖరీదు మూవీ ద్వారా టాలీవుడ్ కి నటుడిగా రంగప్రవేశం చేసారు. ఆ తరువాత నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లిన చిరంజీవి ఖైదీ మూవీతో కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇక అక్కడి నుండి వెనుతిరిగి చూసుకోని చిరంజీవి మొత్తంగా నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్ లో తిరుగులేని మెగాస్టార్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను, కోట్లాది ప్రేక్షకభమిమానుల ప్రేమను సొంతం చేసుకున్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కి 2022 ఏడాదికి గాను బెస్ట్ ఇండియన్ ఫిలిం పర్సనాలిటీగా గొప్ప పురస్కారం వరించిన విషయం తెలిసిందే.
తన కెరీర్ లో ఇప్పటికే 150 కి పైచిలుకు సినిమాల్లో నటించి ఆడియన్స్ ని అలరిస్తున్న మెగాస్టార్ కి ఇంతటి గొప్ప పురస్కారం లభించడంతో అటు ప్రేక్షకాభిమానులతో పాటు ఇటు పలువురు ప్రముఖులు సైతం ఆయనపై అభినందనల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాల టీమ్స్ ప్రత్యేకంగా తమ అభిమాన మెగాస్టార్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్న సందర్భముగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకు బెస్ట్ విషెస్ తెలియ చేసారు.
Team #WaltairVeerayya congratulates Megastar @KChiruTweets Garu on being conferred with Indian Film Personality of the year at the International Film Festival of India ????@IFFIGoa pic.twitter.com/sSBoN1BiX5
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2022
Hearty Congratulations sir Megastar @KchiruTweets garu ❤️
All your dedication & humbleness has always brought you what you truly deserve ???? We are sure many more achievements to come in near future ???? https://t.co/t5pXOVqNzp
— AK Entertainments (@AKentsOfficial) November 21, 2022