సూర్య 37కు కెమెరామెన్ ను మార్చారు !

సూర్య 37కు కెమెరామెన్ ను మార్చారు !

Published on Aug 17, 2018 10:48 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రానికి కెమెరామెన్ ను మార్చారు. ‘రంగం’ఫెమ్ కె వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవల లండన్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈషెడ్యూల్ కు ‘కవాన్’ ఫెమ్ అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. ఇప్పుడు తాజాగా ఆయన స్థానంలో ‘అయాన్’ ఫెమ్ ఎమ్ ఎస్ ప్రభును తీసుకున్నారు. అయితే అభినందన్ ను తీసేయడానికి గల కారణాలు తెలియాల్సివుంది.

ఇక సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న’ఎన్జికె’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నాడు. దాంతో ఈ చిత్ర షూటింగ్ కు విరామం ఇచ్చారు. మలయాళం స్టార్ మోహన్ లాల్ , ఆర్య , మొదలగు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలో సయేశా కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు