కరోనా‌ మహమ్మారి పై స్టార్స్ జ్యోతి ప్రజ్వలన !

కరోనా‌ మహమ్మారి పై పోరాటంలో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ ‘9 గంటల నుంచి 9 నిమిషాలు’ పిలుపు మేరకు సామాన్య ప్రజల దగ్గరనుండి రాజకీయ మరియు సినీ ప్రముఖులందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ బాబు, మోహన్ లాల్, కళ్యాణ్ రామ్ ఇలా చాల మంది సినీ ప్రముఖులు కొవ్వొత్తులు వెలిగించి కరోనా మహమ్మారి తొలగిపోవాలిని కోరుకున్నారు.

ఇక కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు ఇప్పటికే చాలామంది స్టార్స్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి పీఎం సహాయ నిధికి విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.

Exit mobile version