వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చరణ్!

ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తనకు ఇమేజ్ మేకోవర్‌గా నిలుస్తుందని చరణ్ ఆశిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ధృవ’ విడుదలకు సిద్ధమవడంతోనే చరణ్ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టడం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసుకొని జనవరి నెలాఖర్లో సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధం అయింది.

సుకుమార్ సినిమాతో పాటు ఇండియన్ సినిమా గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన మణిరత్నంతో ఓ ద్విభాషా చిత్రం విషయమై చరణ్ చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం మణిరత్నంతో స్క్రిప్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయని చరణ్ స్వయంగా తెలిపారు. ఇక ఆ తర్వాత బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేసేందుకు చరణ్ మక్కువ చూపుతున్నారట. అయితే ఈ ప్రాజెక్టుకి ఇంకా టైమ్ పడుతుందట. ప్రస్తుతానికి సుకుమార్, మణిరత్నం సినిమాలు మాత్రం తప్పకుండా ఉంటాయని చెప్పొచ్చు.

Exit mobile version