ఓటీటీలో ‘వకీల్ సాబ్’.. అస్సలు నమ్మొద్దు

ఓటీటీలో ‘వకీల్ సాబ్’.. అస్సలు నమ్మొద్దు

Published on Apr 12, 2021 7:06 PM IST

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘వకీల్ సాబ్’ గత శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పాండమిక్ టైంలో కూడ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 60 శాతం రికవర్ చేసింది సినిమా. నార్మల్ టికెట్ ధరలతో కూడ సినిమా ఈ స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు కరోనా భయం, ఇంకోవైపు తగ్గిన టికెట్ ధరలతో సినిమా యుద్ధం చేస్తుంటే కొత్తగా ఇంకొక ప్రచారం పుట్టుకొచ్చింది. అదే సినిమా ఓటీటీ విడుదల గురించి.

సినిమాను ఏప్రిల్ 23 నుండి ఓటీటీలో రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు విన్న అభిమానులు సినిమా అంత బాగా ఆడుతుంటే ఓటీటీలోకి దింపడం ఏమిటని డిసప్పాయింట్ అయ్యారు. రెండు వారాల్లోనే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చని నిర్మాత దిల్ రాజు అగ్రిమెంట్ చేసుకున్నట్టు పుకార్లు మొదలయ్యాయి. ఇది డిస్ట్రిబ్యూటర్లను కంగారుకు గురిచేసింది. ఇది గమనించిన నిర్మాణ సంస్థ అవన్నీ తప్పుడు వార్తలని, అస్సలు నమ్మవద్దని, సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచన లేదని, థియేటర్లలొనే చూడాలని తేల్చిచెప్పింది. దీంతో గాలి వార్తలకు చెక్ పడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు