ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “అథర్వ”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ “అథర్వ”

Published on Jan 26, 2024 8:30 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరిల కాంబోలో వచ్చిన చిత్రం “అథర్వ”. ఓ క్రైమ్ సీన్‌లో క్లూస్ టీం ప్రాముఖ్యత ఎలా ఉంటుందన్నది క్లియర్‌గా వివరిస్తూ అథర్వ సినిమాను మహేష్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని.. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లో మంచి సక్సెస్‌ను అందుకుంది.

మరి ఆల్రెడీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇక ఇప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. మరి ఇక్కడి ఓటీటీ ఆడియెన్స్‌ను కూడా అథర్వ ఆకట్టుకునేలా ఉంది. అథర్వ సినిమాకు అటు థియేటర్ ఆడియెన్స్, ఇటు ఓటీటీ లవర్స్‌ను సైతం ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు సౌత్ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మరి ఇప్పుడు నుంచి స్ట్రీమ్ చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు