పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము

పొల్లాచ్చిలో ఎన్టీఆర్ దమ్ము

Published on Feb 16, 2012 8:53 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘చిత్రం’ ప్రస్తుతం పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలకమైన సన్నివేశాలు మరియు ఒక పాట కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం. త్రిషా మరియు కార్తీక హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్ రామారావు సమర్పిస్తుండగా ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు